
కుమారి 21F మూవీతో టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది హెబ్బా పటేల్. సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలోని పాటలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. అప్పట్లో ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అయ్యుంది. ఇప్పుడు హెబ్బా పటేల్ మరో యూత్ ఫుల్ కథతో ప్రేక్షకుల ముందుకు రానునుంది.
ఆదిత్ అరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న మూవీ 24 కిస్సెస్. ఈ మూవీకి అయోధ్య కుమార్ దర్శకత్యం వహిస్తున్నాడు.. టైటిల్ ను బట్టే ఇది యూత్ కి సంబంధించిన కథ అనీ, ప్రేమకథా చిత్రమనే విషయం అర్థమైపోతోంది. రీసెంట్ గా వదిలిన ట్రైలర్ కి 2 మిలియన్ వ్యూస్ దాటిపోవడంతో, ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. కాగా ఈ మూవీని ఈ నెల 23వ తేదీన విడుదల చేయనున్నారు.